ఆంధ్రప్రదేశ్ వాతావరణ హెచ్చరిక:
ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.